మావోయిస్టుల మందుపాతర.. ఇద్దరు జవాన్లు మృతి

మావోయిస్టుల మందుపాతర.. ఇద్దరు జవాన్లు మృతి

బీజాపూర్: గతకొంత కాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు పోలీసులపై పంజా విసిరారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో నలుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారని అధికారులు తెలిపారు. మృతులను స్టేట్ టాస్క్ఫోర్సుకు చెందిన చీఫ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహూ, కానిస్టేబుల్ సాతెర్ సింగ్గా గుర్తించామన్నారు. కానిస్టేబుళ్లు పురుషోత్తమ్ నాగ్, కోమల్ యాదవ్, సియారామ్ సోరి, సంజయ్ సింగ్ గాయపడ్డారని చెప్పారు. ప్రస్తుతం వారంతా జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం వారిని రాయ్పూర్కి తరలించనున్నామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos