తిరువనంతపురం: నటి మమత మోహన్ దాస్ నిర్మాతగా కొత్త సినీ జీవితాన్ని ఆరంభించారు. గాయికిగా చిత్రసీమకు పరిచయమైన ఆమె తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, కథానాయకుడు, చింతకాయల రవి, కింగ్.. వంటి పలు సినిమాలలో కథానాయికగా నటించింది. ఉచ్ఛ స్థితిలో ఉన్నపుడు కేన్సర్కు గురైంది. కేన్సర్ ని జయించి మళ్లీ ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చింది. ఆమె నిర్మించే తాజా సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ‘మమతా మోహన్ దాస్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తానని ‘చిత్ర పరిశ్రమ నుంచి నేను ఎంతో పొందాను. ఈ పరిశ్రమకు ఎంతో కొంత ఇవ్వాలని అనుకుంటున్నాన’ని చమత్కరించింది.