యువవైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో సూపర్స్టార్ మహేశ్బాబు సైతం ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటనపై స్పందించాడు. ఈ మేరకు ఓ కవితను చెబుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేశారు.మహిళలతో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తిస్తే మగాళ్లు అంటారో కవిత రూపంలో తెలియజేస్తూ మహేశ్ విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది..