నష్టాల్లో మార్కెట్లు

నష్టాల్లో మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం పది గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా కోల్పోయి 36,698 వద్ద, నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంతో 10,800 వద్ద ఉన్నాయి. గురువారం నమోదైన లాభాలను మదుపరులు సొమ్ముచేసుకోవటం నష్టాలకు కారణం. సన్ఫార్మా, బజాజ్ ఆటో, ఎస్బీఐ, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్ని పొందాయి. టెక్ మహీంద్రా, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos