హొసూరు : పారిశ్రామిక నగరి హొసూరులో 144 సెక్షన్ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గత మూడు రోజులుగా 110 మందిపై కేసులు నమోదు చేసి, 40కి పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి గత మూడు రోజులుగా 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ను ఉల్లంఘించి విచ్చలవిడిగా వాహనాలపై రోడ్ల మీద తిరుగుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేశారు. హొసూరులో శనివారం డ్రోన్ కెమెరాల ద్వారా ప్రజల రాకపోకలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. 144 సెక్షన్ను పట్టించుకోకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత మూడు రోజులుగా కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామని డీఎస్పీ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. లాక్డౌన్ను
ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.