బీజేపీ అమ్మాయి..కాంగ్రెస్ అబ్బాయి

బీజేపీ అమ్మాయి..కాంగ్రెస్ అబ్బాయి

రాజకీయంగా బధ్ధశత్రువులుగా ముద్రపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువతి, యువకుడు వారి రాజకీయాలు పక్కనపెట్టి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఒకే ప్రాంతంలో రాజకీయ శత్రువులుగా ఉన్న ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.కర్ణాటక రాష్ట్రంలోని చౌడాపుర తాలుకా పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసిన రుక్మిణి జమాదార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక కరజగి తాలుకా పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పోటీ చేసిన భీమాశంకర్ బీజేపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అయ్యారు.పంచాయితీ సభలు, సమావేశాల్లో రుక్మిణి, భీమాశంకర్ ఒకరి పార్టీ మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆ ఆరోపణలు, విమర్శలు పంచాయితీ కార్యాలయం గొడల మధ్య వరకే పరిమితం అయ్యాయి. అయితే ఇదే సమయంలో రుక్మిణి, భీమాశంకర్ మాటామాటా కలిపి స్నేహితులు అయ్యారు.ఆలా ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కారు.రుక్మిణి, భీమాశంకర్ పెళ్లికి కలబురిగి జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కొందరు ఎమ్మెల్యేలు హాజరైనారు. రుక్మిణి, భీమాశంకర్ పెళ్లి సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి రాజకీయాలు పక్కనపెట్టి ఒక్కటి అయ్యారు.అయితే మంగళవారం రాత్రి రిసెప్షన్ ఫోటోలు బయటకు రావడంతో అధికారులు రుక్మిణి, భీమాశంకర్ కు ఊహించని షాక్ ఇచ్చారు.రోనా కాలంలో పెళ్లి చేసుకున్న ప్రజాప్రతినిధుల మీద లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos