ఫలితాల వెల్లడి : స్థానిక సంబరాలు

ఫలితాల వెల్లడి : స్థానిక సంబరాలు

హొసూరు :  కృష్ణగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు గురువారం అర్ధ రాత్రి నాటికి పూర్తిగా వెలువడ్డాయి. గత నెల 27, 30 తేదీల్లో రెండు

విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు

గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై, అర్ధ రాత్రి దాకా కొనసాగింది. పంచాయతీ అధ్యక్ష, యూనియన్‌ కౌన్సిలర్‌, జిల్లా కౌన్సిల్‌, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 1,770 మంది ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్‌  పదవులకు 20

మంది ఎన్నిక కాగా, మొత్తం పది యూనియన్లలో 225 మంది కౌన్సిలర్లుగా, 332 మంది పంచాయతీ అధ్యక్షులుగా గెలుపొందారు. 1,197 మంది వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos