తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా
మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరిలో 34.28 శాతం అధికంగా విక్రయాలు
నమోదయ్యాయి. ఆదాయ రూపేణా చూస్తే…ఇది రూ.480 కోట్లు అధికం. జనవరిలో 12.39 లక్షల మద్యం
కేసులు అదనంగా అమ్ముడవగా, ఇందులో 3.97 లక్షల బీరు కేసులు ఉండడం విశేషం. ఎన్నికల్లో
మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో నిలవగా, నల్గొండ, మేడ్చల్ మల్కాజిగిరి,
సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలబడ్డాయి.