హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

హొసూరు :  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరికి ఇక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని తొలువు బెట్ట గ్రామానికి చెందిన బసప్ప, అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మల్లప్ప, చిన్న తిమ్మప్పలతో బసప్ప ఈ విషయమై గొడవ పెట్టుకున్నాడు. ఆ మహిళ ఇంటికి వెళ్లరాదని బసప్ప వారిని హెచ్చరించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. వివాదం ముదరడంతో బసప్పను హత్య చేయడానికి పథకం వేశారు. 2015లో బసప్పను నాటు తుపాకీతో కాల్చి చంపారు. ఈ సంఘటన హొసూరు ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి,  మల్లప్ప, చిన్నతిమ్మప్పలను అరెస్టు చేశారు. హొసూరు కోర్టులో నాలుగేళ్లుగా దీనిపై విచారణ జరిగింది. మల్లప్ప, చిన్నతిమ్మప్పలను కోర్టు దోషులుగా ప్రకటిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తలా రూ.25 వేల జరిమానా కూడా విధించింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos