విజయవాడ: ‘వామపక్షాలకు నేను ఏమైనా బాకీ ఉన్నానా? ఆ పార్టీలకు నేనేమీ చెబుతాను’అని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భాజపాతో గురువారం ఇక్కడ పొత్తు పొసిగిన తర్వాత విలేఖరులతో మాట్లాడారు. వామపక్ష పార్టీలతో కలవక ముందే భాజపా కోసం పని చేసాను. రాష్ట్ర భవిష్యత్ కోసం భాజపాతో కలిసి ముందుకు వెళతాం. అమరావతిపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంద’న్నారు. అమరావతిపై ప్రభుత్వం ఎలా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేశారు.