లత ఆరోగ్యం నిలకడగా ఉంది

లత ఆరోగ్యం నిలకడగా ఉంది

ముంబై : గాయకి లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఆమెకు చికిత్స కొనసాగుతోందని ఆమె ప్రతినిధులు శనివారం ఇక్కడ ప్రకటించారు. ‘దయచేసి పుకార్లను ప్రచారం చేయొద్దు. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు కొంత ప్రైవసీ ఇవ్వాల’ని కోరారు. కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడిన ఆమెను ఈ నెల 11న ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి న్యుమోనియా ఉందని తేల్చారు. అప్పట్నుంచి ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. లత ఆరోగ్యం క్షీణించిందంటూ గత వారం ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టింది. అప్పుడు కూడా ఆమె ప్రతినిధి ఆ వార్తలను కొట్టిపారేసారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆమె ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కలచివేస్తోందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos