భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు రిషబ్ పంత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎంతోమంది ప్రతిభావంతులను కాదని రిషబ్కు పదేపదే అవకాశాలు ఇస్తున్నా రిషబ్ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు.నిలకడలేమి,పేలవ ప్రదర్శనతో ఆటలో ఘోరంగా విఫలమవుతున్నా వైఫల్యాలపై దృష్టి పెట్టకుండా అదే నిర్లక్ష్యం కొనసాగిస్తుండడంతో ప్రతి ఒక్కరూ రిషబ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా బాలీవుడ్ హీరోయిన్తో చెట్టాపట్టాలు వేసుకొని తిరగుతూ మీడియా కంట పడడంతో క్రీడాభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతెలా ముంబైలోని ఓ స్టార్ హోటల్ కు కలిసి రావడంతో, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నాన్న వార్తలు గుప్పుమన్నాయి. అప్పట్లో హార్దిక్ పాండ్యాతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఊర్వశి, ఇప్పుడు పంత్ తో జత కట్టిందని నెటిజన్లు అంటున్నారు.కాగా, ఇటీవలి టీ-20 సిరీస్ లో పండ్ కేవలం 18, 33 నాటౌట్, 0 పరుగులకు పరిమితమై నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.