హరిద్వార్ : మహా కుంభమేళా సందర్భంగా కోవిడ్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. లక్ష వరకూ నకిలీ కోవిడ్ పరీక్షల నివేదికలపై జరిపిన విచారణలో ఒకే ఫోన్ నెంబర్తో 50 మందికి పరీక్షలు జరిగినట్లు వెల్లడైంది. కోవిడ్ టెస్టు ల్యాబ్ నివేదికల్లోనూ చాలా అవకతవకలున్నట్లు తేలింది. గత ఏప్రిల్ 1 నుంచి 30 వరకూ మహాకుంభమేళాను నిర్వహించారు. భక్తులు పోటెత్తటంతో రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఓ ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించింది. ఆ పరీక్షలు, రిపోర్టుల్లో సుమారు లక్ష వరకు నకిలీ నివేదికలేనని దర్యాప్తులో వెల్లడైంది.