యువత కడుపు కొడుతున్న కేంద్రం

యువత కడుపు కొడుతున్న కేంద్రం

హైదరాబాద్: అగ్నిపథ్ పేరిట కేంద్రం యువత కడుపు కొడుతోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆవేదనతో వారు ఆందోళన చేస్తుంటే వారిపై దేశద్రోహం కేసులు పెడుతు న్నారని విమర్శించారు. నగరంలో మంగళవారం జరిగిన ప్లైవోవర్ ప్రారంభోత్సవంలో ప్రసంగించారు. ‘కిషన్ రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి. అగ్నిపథ్లో చేరితే డ్రైవర్లు, బట్టలు ఉతికే , క్షవరం చేసే నిపుణతలు వస్తాయి అంటున్నారు. ఈ మాత్రం దానికి దేశ యువత మిలిటరీలో చేరాలా బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరా బాద్ వస్తారు అని అంటున్నారు. ఏ మొహం పెట్టుకుని హైదరాబాద్కు వస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా రూ. వేల కోట్ల పనులు శంకుస్థాపన చేశారని చెప్తారు అందులో ఎంత నిజముందో తెలియదు. హైదరాబాద్కు టూరిస్టులు వస్తారు పోతారు. మన కేసీఆర్ ఇక్కడే ఉంటారు. వచ్చే టూరిస్టులు ఏం తెచ్చారో ఏం ఇచ్చారో చెప్పాలని’ కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos