డెహ్రాడూన్ : ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఉత్తరాఖండ్ పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వినూత్న చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో భారత క్రికెటర్ల తప్పిదాలను వాడుకుంటున్నారు. గతంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన నోబాల్ను సిగ్నల్ జంప్నకు వాడిన పోలీసులు తాజాగా.. విరాట్ కోహ్లీ డకౌట్ను వాడుకున్నారు. ఇంగ్లాండ్తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే. మొత్తం 5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ.. అదిల్ రషీద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్రిస్ జోర్డాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే విరాట్ డకౌట్ను ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్నంగా వాడుకున్నారు. డకౌటై పెవిలియన్కు వెళ్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ… ‘హెల్మెట్ వేసుకుంటే సరిపోదు. పూర్తి స్పృహతో వాహనం నడపాలి. అలా డ్రైవింగ్ చేయకపోతే కోహ్లీలా మీరూ డకౌట్ అవుతారు.’ అంటూ వాహనదారులను హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.