గుడివాడ:అమలాపురం హింసకు విపక్షాలే కారణమని వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పబ్బం గడుపుకున్నారు. అంబేద్కర్ ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించాలి. జైళ్లలో పెట్టాలి. ఎవరో రాసిచ్చిన స్క్రిస్ట్ ను చదువుతూ, రాజ్యాంగంపై కనీస అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుంది. జనసేన కార్యకర్తలంతా నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్లే. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యం. అమలాపురంలో హింస చోటు చేసు కున్నప్పుడు పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేసి ఉంటే పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చేది. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని అలాంటి పని చేయలేదు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడినా, పోలీసులకు గాయాలయినా సంయమనాన్ని పాటించారు. ఒకవేళ పోలీసులు కాల్పులు జరిపి ఉంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ శవ రాజకీయాలు చేసేవార’న్నారు.