నిరూపించండి… పెట్రోల్ పోసుకుని అంటించుకుంటా

నిరూపించండి… పెట్రోల్ పోసుకుని అంటించుకుంటా

అమరావతి: ‘నా కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుంది. అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాన’ని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘చంద్రబాబు టైమ్ అయిపోయింది.ఈ రోజు నిజ నిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారే. రాష్ట్రంలో అన్ని చోట్ల జూదం జరిగిన విధంగానే గుడివాడలో కూడా జరిగింది. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని నాకు సమాచారం అందిన వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నాను. చంద్రబాబుకు, నారా లోకేశ్ కు కేసినోలు బాగా తెలుస’న్నారు.‘నా కన్వెన్షన్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారు. తెదేపా నిజ నిర్ధారణ సమితి అవసరం లేదు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోంద’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos