రాహుల్‌కు జాక్‌పాట్‌

  • In Sports
  • January 22, 2022
  • 103 Views
రాహుల్‌కు జాక్‌పాట్‌

టీమిండియా స్టార్ బ్యాటర్‌ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించాడు. ఐపీఎల్ 2022కు మెగా వేలంపాటను నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈ సీజన్ లో మరో రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో జట్లు తోడవనున్నాయి. దీంతో వేలంపాట మరింత ఆసక్తికరంగా మారనుంది.

మరోవైపు ఈ రెండు జట్లు తమ డ్రాఫ్ట్ పిక్స్ ను అధికారికంగా ప్రకటించాయి. బీసీసీఐ రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఇరు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను తీసుకున్నాయి. లక్నో జట్టు కేఎల్ రాహుల్ ను రూ. 17 కోట్లకు తీసుకుంది. అంతే కాదు తమ జట్టుకు కెప్టెన్ గా ఎంచుకుంది. ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కోహ్లీ పేరిట ఇప్పటి వరకు రికార్డు ఉంది. గత సీజన్ లో కోహ్లీ రూ. 17 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును రాహుల్ అందుకున్నాడు. మరోవైపు అహ్మదాబాద్ జట్టు హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్ లను రూ. 15 కోట్లకు తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos