బాంబు వేసి చంపుతాం

బాంబు వేసి చంపుతాం

లక్నో : భాజపా లోక్సభ సభ్యుడు సాక్షి మహారాజ్ కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్థాన్ ఫోన్ నెంబరు +923151225989 నుంచి రెండు సార్లు ఆగంతకుడు ఫోన్ చేసి తన ఇంటిపై బాంబు వేసి చంపేస్తామంటూ బెదిరించాడని సాక్షి మహారాజ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. ‘నా స్నేహితుడు మహ్మద్ గఫార్ ను పోలీసులకు పట్టిచ్చి మృత్యువును ఆహ్వానించావు. పది రోజుల్లోగా నీతోపాటు నీ అనుచరులను హత మారుస్తాం అని కాలర్ హెచ్చ రించాడు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లనూ ప్రస్తావించి వారిని దూషించారు. గజ్వా-ఎ-హింద్ పేరుతో భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడం గురించి కూడా మాట్లాడారు. రాడికల్ ఐడియాలజీ ఉన్న కొందరు, ఉన్నవో లోని పీఎఫ్ఐ సభ్యులు కూడా గతంలో నన్ను బెదిరించారు. గతంలో కువైట్ కు చెందిన మహ్మద్ గఫార్ నన్ను బెదిరించాడు. నేను చేసిన ఫిర్యాదు పై ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ గఫార్ను అరెస్టు చేసింది. అతని స్నేహితుడు ఇప్పుడు బెదిరించాడు. ఫోన్లో మూడు నిమిషాలు మాట్లాడాడ’ని ఫిర్యాదులో వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఉన్నవో ఎస్పీ రోహన్ పి కనయ్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos