గాంధీజీని కించపర్చేలా ప్రవర్తిస్తున్నారు

గాంధీజీని కించపర్చేలా ప్రవర్తిస్తున్నారు

హైదరాబాదు: దేశంలో పేదరికం ఉన్నంతకాలం అలజడులు, అశాంతి ఉంటాయని.. పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఈ దేశం నాది అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలగాలని.. అప్పుడే మహోజ్వల భారత్ సాకారమవుతుందని చెప్పారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా హైద రాబాద్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లా డారు. వజ్రోత్సవ వేడుకలను అద్భుతంగా నిర్వహించు కుం దా మని పిలుపునిచ్చారు.‘ గాంధీజీ నాయకత్వంలోనే అంతా..ఇప్పటి తరానికి స్వాతంత్ర్య పోరాట ఘటనలేవీ తెలియవు. . అనేక పోరాటాలతో స్వాతంత్ర్యం వచ్చింది. నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమ కారులను అణచివేయడానికి ప్రయత్నించింది. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం సిద్ధించేందుకు కృషి చేశారు. గాంధీజీ స్ఫూర్తితోనే అమెరికా అధ్యక్షుడిని అయ్యానని బరాక్ ఒబామా చెప్పటాన్ని మరువ రాదు. కానీ కొందరు గాంధీజీని కించ పర్చేలా ప్రవర్తిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని కలిపి ఉంచేం దుకు ఎంతోమంది ఎంతగానో కష్టపడ్డారు. సంస్థానాలను దేశంలో విలీనం చేయించార’ని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వ హిస్తు న్నామని పేర్కొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కొందరు రాజకీయ నాయకుల చిల్లర మల్లర చేష్టలను ప్రతి ఒక్కరూ చీల్చి చెండాడా లని.. ఐకమత్యంతో ఉండి భారత జాతి ఔన్నత్యం చాటాలని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos