కేటీఆర్ అంత కాకపోయినా నిజామాబాద్ మాజీ లోక్ సభ సభ్యురాలు,తెరాస మహిళా నేత కల్వకుంట్ల కవిత సైతం సామాజిక మాధ్యమాల్లో కొంత చురుకుగా ఉంటారు.అప్పుడప్పుడూ అభిబమానులు, కార్యకర్తలు, ప్రజలతో రాజకీయ,వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన కుమారుడు ఈ ట్వీట్ ను తనకు పంపించాడని ఆమె చెప్పారు.ఇందులో వారంతాల గురించి ‘మిస్టర్ బీన్‘ చేస్తున్నట్లు ఓ కామెంట్ ఉంది. “నేను ఏమనుకుంటున్నానంటే… వారాంతాలు చైనాలో రూపుదిద్దుకున్నట్టున్నాయి. అందుకే అవి ఎక్కువ కాలం ఉండవు” అన్న కొటేషన్ ఉంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సరదాగా కమెంట్లు చేస్తున్నారు..
My son shared it with me !! 😊 pic.twitter.com/FGJ27CKFeO
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2019