హొసూరు : హొసూరు ప్రాంతంలో కార్తీక దీపోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించారు. డెంకణీకోట సమీపంలోని కుందుకోట మల్లిఖార్జున స్వామి దేవాలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మల్లిఖార్జున స్వామి ఉత్సవ మూర్తి ఊరేగింపును నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపాన్ని వెలిగించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.