న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్దేవ్కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు.