మోదీని నిర్మొహమాటంగా సమర్థించే కంగనా రనౌత్ ఈసారి హర్టైంది. ప్రధాని నిర్ణయం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది. ‘విషాదకరం, అవమానకరం, ఇది పూర్తిగా అన్యాయం. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాకుండా రోడ్డు మీది జనం చట్టాలు చేయటం మొదలు పెడితే ఇక మనది కూడా ఒక జిహాదీ దేశమే. ఇటువంటి స్థితి కోరుకున్న వారందరికీ శుభాకాంక్షలు…’ అంది.