చిన జియ్యరు ఏలుబడిలో తెలంగాణ

చిన జియ్యరు ఏలుబడిలో తెలంగాణ

హైదరాబాద్: ఆధ్యాత్మిక బోధకులు రామానుజచిన జీయర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఆచార్య కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. మంగళ వారం ఇక్కడ సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ‘అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, దోషులను శిక్షించండి’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఈ రాష్ట్రాన్ని చిన జీయర్ పరి పాలిస్తున్నారు. దళితులు, వెనుక బడిన వర్గాల పక్షపాతి అని ప్రచారాన్ని చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత వరకు ఏ అంబేద్కర్ విగ్రహానికి నివాళు లర్పించలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన చోటే తిరిగి ప్రతిష్టించాలి. విగ్రహం కూల్చి వేసి రోజులు గడు స్తున్నా కేసీఆర్ స్పందించలేదు. అంబేద్కర్తో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగు పడలేద’ని మండి పడ్డారు. అన్ని రకాల పీడనాలకు, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడినపుడే తెలంగాణలో కుల వివక్ష పోతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ బుద్ధి పూర్వకంగానే దళితులు, కమ్యూ నిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos