విజయవాడ: నగరంలో కట్టిన కనకదుర్గ ఉపరితల వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్ర వారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. అమరావతి నుంచి జగన్, ఢిల్లీ నుంచి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. రూ.502 కోట్లతో, ఆరు వరుసలతో 2.6 కి.మీ పొడవైన వంతెనను 900 పని దినాలలో దీన్ని పూర్తి చేసారు. అనంతరం రూ.7,584 కోట్లతో నిర్మించనున్న మరో 16 పథకాలకూ భూమిపూజ చేసారు. రూ.8,007 కోట్ల రూపాయలతో ఇప్పటికే పూర్తయిన పది ప్రాజెక్టులనూ లాంఛనంగా ఆరంభించారు.