చెన్నై : ద్రావిడ పార్టీలకు బదలుగా ఇతర పార్టీల పొత్తుతో మహా కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీ చేయదలచినట్లు మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యనిర్వాహక సమితి సమావేశంలో ప్రసంగించారు. అవసరమయితే తృతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకూ సిద్ధంగా ఉన్నాన్నారు. కార్యనిర్వాహక సమితి సభ్యుల్లో పలువురు ఒంటరిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. మరికొందరు జాతీయ పార్టీలతో పొత్తు సమంజసమని సలహా ఇచ్చారు.