చెన్నై: చైనా బలగాలతో సరిహద్దు ఘర్షణకు సంబంధించి భావోద్వేగాలతో ప్రజలను తప్పుదొవ పట్టించవద్దని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ ప్రధాని మోదీకి హితవు చెప్పారు. లఢక్ ఘర్షణలో ఎవ్వరూ భారత భూభాగంలోకి రాలేదని, భారత భూ బాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వ పెద్దలుఇచ్చిన సమాధానాలు మోసపూరితంగా ఉన్నాయని దుయ్యబట్టారరు. ఇప్పటికైనా ప్రధానమంత్రి, ఆయన అనుయాయులు, భాజపా నేతలు ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే పని చేయోద్దని కోరారు.‘ప్రశ్నించడాన్ని దేశ ద్రోహంగా పరిగణించరాదు. అడిగే హక్కును ప్రజాస్వామ్యం అందరికీ ఇచ్చింది. సమాధానం వచ్చేంతవరకు అడుగుతూనే ఉంటార’ని కమల్ కుండ బద్దలు కొట్టారు.