అమరావతి : ‘ఈ ఎదురు కాల్పులతో ఇలాంటి ఘటనలు పునారా వృతం కాబోదని అనుకోరాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు, మహిళలపై దారుణాలకు పాల్పడే మృగాళ్లను వదిలి పెట్టకూడదని అన్నారు. ‘ఇలాంటి కేసుల్లో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి. కేవలం రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలి. గతంలో నిర్భయ ఘటన తరువాత బలమైన చట్టాన్ని చేసినా అత్యాచారాలు ఆగలేదు. అమ్మా యిల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడేలా కఠిన చట్టాలు చేయాలి. ఇందుకోసం ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి. ఇందుకు మేధావులు ముందుకు రావాల’ని పేర్కొన్నారు.