కీచకులైన ఢిల్లీ పోలీసులు

కీచకులైన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు తన బిట్టలు చింపేశారని తమిళనాడుకు చెందిన, కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యురాలు జ్యోతిమణి లోక్సభ సభాపతి ఓంబిర్లాకు ఫిర్యాదు చేసారు. పోలీసులపై చర్యల్ని తీసుకోవాలని డిమాండు చేసారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఈడీ విచారిస్తోంది. దీనికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంలోనే పోలీసులు తన బట్టలు చింపేశారంటూ జోతిమణి విమర్శించారు. ‘పోలీసులు మాపై భీకర దాడకి పాల్పడ్డారు. వాళ్లు నా బట్టలు చింపేశారు. నా బూట్లు తొలగించారు. నన్ను ఒక క్రమినల్లాగ తీసుకెళ్లారు’అని వివరించారు. సంబంధిత వీడియోను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు. ‘‘ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఈ చర్య దారుణమే. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం ప్రతి భారతీయ మర్యాదకు అవమానం. అలాంటిది లోక్సభ ఎంపీకే ఇలా జరగడం మన ప్రమాణాలను ఎంత తక్కువ తీసుకెళ్తున్నారో అర్థం అవుతోంది. ఢిల్లీ పోలీసుల ప్రవర్తనను ఖండిస్తున్నాను. స్పీకర్ ఓంబిర్లా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos