యూనివర్శిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

యూనివర్శిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

న్యూ ఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ) యూనివర్శిటీ గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలను రాశారు.దీంతో అక్కడ మరో వివాదం తలెత్తింది. స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ విభాగం గోడలు, పలువురు ఫ్యాకల్టీ గదుల తలుపులపై బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, అభ్యంతరకరమైన రాతలు రాశారు. ‘క్యాంపస్ ను బ్రాహ్మణులు విడిచి వెళ్లాలి… బ్రాహ్మణ్-బనియాలపై ప్రతీకారం తీర్చుకుంటాం… బ్రాహ్మణ్ భారత్ చోడో’ అని రాశారు. దీనిపై యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ శాంతిశ్రీ పండిట్ దర్యాప్తుకు ఆదేశించారు. ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఆరోపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos