అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు

అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు

హైదరాబాదు : దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘ పీసీసీ అధ్యక్షుడు కేవలం రాష్ట్ర పార్టీ యంత్రాంగానికి, హైకమాండ్ కు సమన్వయకర్త మాత్రమే’ ప్రతి ఒక్క నాయకుడిని సంతృప్తి పరచడం సాధ్యం కాదు. సోనియా నాయకత్వంలోనే అందరం పని చేస్తున్నాం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి మధ్య ఏం జరుగుతోందో నాకు తెలియద’ని చెప్పారు. రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు మల్లు రవి గుప్పించారు. ‘కాంగ్రెస్ ను చంపి, బీజేపీని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. దాసోజు శ్రవణ్ పై ఒత్తిడి తెచ్చి పార్టీ మారేలా చేశారు. బీజేపీ వాళ్ల రాజకీయాలు దిగ జారి పోయాయి. దాసోజు శ్రవణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండిస్తున్నాన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos