దోషుల్ని న్యాయ స్థానాలే శిక్షించాలి

దోషుల్ని న్యాయ స్థానాలే శిక్షించాలి

న్యూ ఢిల్లీ: దిశ నింది తుల్ని పోలీసులు ఎదురు కాల్పుల్లో హతం చేసినందుకు హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు కొన్ని వర్గాలు, కొందరు రాజకీయ నేతల నుంచి ఆక్షేపణలు వ్యక్త మయ్యాయి. ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు సరైనప్పటి్కీ నేరగాళ్లకు చట్టపరంగా శిక్ష పడితే బాగుండేదనే అభిప్రాయపడ్డారు. ‘చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకో కూడదు. నేరం రుజువైన తర్వాత నిందితులకు తప్పకుండా ఉరిశిక్ష పడేది’ అని కేంద్ర మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. ‘నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడల్లా ప్రజల్లో ఆక్రోశం పెరుగు తోంది. అందుకే ఎదురు కాల్పుల గురించి తెలియగానే హర్షించారు. అయితే ఇదే సమయంలో మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్నిర’ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ‘నిందితులకు మరణశిక్షే మేం కోరుకున్నది. అయితే అది న్యాయపరంగా జరిగితే బాగుండేది. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందో తెలియదు. అది పోలీసులు మాత్రమే చెప్పగలరు’ అని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ అన్నారు. ‘ఈ చర్య భవిష్యత్లో మహిళలపై దారుణాలను ఆపగ ల్గుతుందా?. మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి రేపిస్టును ఇలాగే శిక్షిస్తారా?’ని గుత్తా జ్వాల ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos