పురుచ్చితలైవి జయంతి వేడుకలు

పురుచ్చితలైవి జయంతి వేడుకలు

హొసూరు : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఏడీఎంకే నాయకులు ఘనంగా నిర్వహించారు. క్రిష్ణగిరి జిల్లాలోని హొసూరు,  శూలగిరి, బాగలూరు తదితర ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. హొసూరు సమీపంలోని బాగలూరు బస్టాండులో బాగలూరు పంచాయతీ అధ్యక్షులు వీడీ. జయరామ్ అధ్యక్షతన జయలలిత జన్మ దిన వేడుకలను అతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా విచ్చేసిన మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 72 కిలోల కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శూలగిరి యూనియన్ బేరికెలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా చైర్‌పర్సన్ లావణ్య పాల్గొని జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos