వంగవీటికి జగన్ ఝలక్

వంగవీటికి జగన్ ఝలక్

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేత వంగవీటి రాధా కి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని.. రాధా త్వరలో పార్టీ మారనున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ గతేడాది చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర.. రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కాగా…  ఈ ముగింపును వేడుకగా చేయాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో ఈ యాత్ర ముగియనుంది.విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్ని విభేదాల కారణంగానే రాధా ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నారని పార్టీ  వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రాధా కూడా స్పందించారు. పాదయాత్ర ముగింపు సభకు కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించారని.. తనకు జగన్ వద్ద నుంచి ఆహ్వానం అందలేదని.. అందుకే తాను దూరంగా ఉన్నట్లు రాధా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos