వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేత వంగవీటి రాధా కి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని.. రాధా త్వరలో పార్టీ మారనున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ గతేడాది చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర.. రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ ముగింపును వేడుకగా చేయాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో ఈ యాత్ర ముగియనుంది.విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్ని విభేదాల కారణంగానే రాధా ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రాధా కూడా స్పందించారు. పాదయాత్ర ముగింపు సభకు కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించారని.. తనకు జగన్ వద్ద నుంచి ఆహ్వానం అందలేదని.. అందుకే తాను దూరంగా ఉన్నట్లు రాధా తెలిపారు.