కాంగ్రెస్ కార్యాలయంలో ఐటీ దాడులు.

కాంగ్రెస్ కార్యాలయంలో ఐటీ దాడులు.

పట్నా : ఇక్కడి బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి కార్యాలయంపై శుక్రవారం ఆదాయపు పన్నుశాఖ దాడి చేసింది. కార్యాలయం ఆవరణలోని కారు నుంచి రూ.8.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అశుతోష్ ను అదుపులోకి తీసుకొని నగదు గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకా బీహార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు శక్తి సింగ్ గోహిల్, జాతీయ మాధ్యమ బాధ్యుడు రణదీప్ సుర్జేవాలానూ ప్రశ్నించారు. ఐటీ దాడులను శక్తి సింగ్ గోహిల్ వ్యతిరేకించారు. బీహార్ ఎన్నికల్లో ఓడిపోతున్న బీజేపీ, జేడీయూ పార్టీ నేతల సూచనల మేర తమ పార్టీ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారన్నారు. డబ్బు ఉన్న కారుతో తమ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని శక్తిసింగ్ గోహిల్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos