ఐఎస్‌బీ విద్యార్థుల‌పై నిఘా

ఐఎస్‌బీ విద్యార్థుల‌పై నిఘా

తిరుపతి : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులపై నిఘా పెట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఈ నెల 26న ఐఎస్బీ 20వ వార్షి కోత్సవం, స్నాతకోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు చేసిన వారిపై నిఘా ఉంచి, వార్షికోత్సవానికి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి చర్యలు దుర్మార్గం. ప్రజాస్వామ్య దేశం లో పౌరులకు వారి భావాలు వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. దాన్ని అణచివేయాలనుకోవడం సరికాదు. నియంతృత్వ ధోరణి బిజినెస్ స్కూల్లో ప్రారంభిస్తే అందులో చదివే విద్యా ర్థులు సమాజానికి ఉపయోగపడేవారు అవుతారా? లేక నియంతల్లాగా తయారు అవుతారా? వెంటనే నిఘాను ఎత్తివేయాలి. విద్యార్థులందరూ వార్షికోత్స వంలో పాల్గొ నేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే మోదీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos