ఐపీఎల్‌కు పెరిగిన వీక్షకులు

  • In Sports
  • October 2, 2020
  • 140 Views
ఐపీఎల్‌కు పెరిగిన వీక్షకులు

కరోనా వైరస్ కారణంగా స్టేడియంలకు వెళ్లే వీల్లేకపోవడంతో ఐపీఎల్ మ్యాచులను టీవీల్లోనూ, ఐప్యాడ్లు, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్లలో చూస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సీజన్లో ఐపీఎల్ వీక్షణల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 సీజన్ మొదటి వారంతో పోల్చితే తాజా సీజన్ మొదటి వారంలో 15 శాతం పెరుగుదల నమోదైంది. 60.6 బిలియన్ల నిమిషాల పాటు ఐపీఎల్ వీక్షించారని టీవీ వ్యూస్ మదింపు సంస్థ బీఏఆర్సీ వెల్లడించింది. ప్రతిమ్యాచుకు 39 మిలియన్ల ఇంప్రెషన్లు రాగా, గతేడాదితో పోల్చితే ఆ సగటు 21 శాతం పెరిగింది. వీక్షణల్లో ఈ వృద్ధి కరోనా వ్యాప్తి ఫలితంగానే సాధ్యమైందని చెప్పాలి. ప్రేక్షకులు స్టేడియంలకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడం, లాక్ డౌన్ల కారణంగా చాలావరకు ఇంటికే పరిమితం కావడంతో టీవీల్లో మ్యాచ్ లు చూసేవారి సంఖ్య మొదటివారంలో బాగా పెరిగిందని బీఏఆర్సీ వివరించింది.
ఈ ఐపీఎల్ 13వ సీజన్ లో మొదటివారం మొత్తమ్మీద 269 మిలియన్ల మంది మ్యాచులను వీక్షించారు. సెప్టెంబరు 19న జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచులో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా, 158 మిలియన్ల మంది మ్యాచ్ చూశారు. 2019 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ తో పోల్చితే ఇది 21 శాతం ఎక్కువ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos