క్రికెట్ అతి పెద్ద పండుగ అయిన ఐపీఎల్లో వీక్షకుల సంఖ్య సీజన్ సీజన్కు మిలియన్ల సంఖ్యలో పెరుగుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తోంది. తాజా సీజన్లో ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయి 380 మిలియన్లు దాటింది. ఇది 35వ మ్యాచ్ ముగిసే సమయానికి గతేడాదితో పోలిస్తే.. ఏకంగా 12 మిలియన్లు అధికం. ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్ బెర్తులు ఇంకా ఖరారు కాక ముందే ఈ స్థాయిలో వీక్షకుల సంఖ్య నమోదు కావడం ఇదే ప్రధమమని, లీగ్ ముగిసే సమయానికి ఇది 500 మిలియన్ల మార్కును దాటుతుందని లీగ్ బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది.