ఇన్ఫోసిస్‌ లో అవినీతి

ఇన్ఫోసిస్‌ లో అవినీతి

బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ అనైతిక పద్ధతులను అవలంభించినట్లు గుర్తు తెలియని ఉద్యోగులు కొందరు బోర్డుకు గత సెప్టెంబరు 20న ఫిర్యాదు చేశారు. దాని ప్రతి ప్రముఖ మాధ్యమ సంస్థలకు లభించింది. ‘‘పరేఖ్, రాయ్ అనేక త్రై మాసికాలుగా అనైతిక పద్ధతులను అవలంబిస్తున్నారు. దానికి సంబంధించి ఈమెయిల్, వాయిస్ రికార్డింగ్ రూపంలో ఆధారాలు ఉన్నాయ’ని అందులో పేర్కొన్నట్లు పీటీ ఐ వెల్లడించింది.ఈ ఫిర్యాదుకు బోర్డు నుంచి స్పందన కరువు కావటంతో ఫిర్యాదుదారుల్లో ఒకరు అమెరికాలోని ‘విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’ కార్యాలయానికి అక్టోబర్ 3న ఫిర్యాదు చేసారు. ‘గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపా’ని ఆరోపించారు. జూన్-సెప్టెం బరు త్రైమాసికంలో లాభాల్ని ఎక్కువ చేసి చూపడం కోసం వీసావంటి ఖర్చుల్ని ఖాతాల్లో చూపొద్దని ఆదేశించినట్లు తెలిపారు. సంబంధిత వాయిస్ రికార్డింగులు ఉన్నాయని తెలిపారు. ఒక గుత్త విషయంలో 50 మిలియన్ డాలర్లు విలువ చేసే మార్పులను పరిగణనలోకి తీసుకోరాదని తమపై ఒత్తిడి తెచ్చినట్లు వివరించారు. రివర్సల్స్ వల్ల త్రైమాసిక లాభాలకు గండిపడి షేర్ల ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తమతో చెప్పార న్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కీలక సమాచారాన్ని ఆడిటర్లకు, బోర్డుకు తెలియకుండా దాచారని ఆరోపించారు. ప్రముఖ కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారం నమోదు చేసేలా ఒత్తిడి తెచ్చారన్నారు. పరేఖ్ చేతిలో కీలు బొమ్మ గా మారిన రాయ్ సహకరి స్తున్నారని ఆరోపించారు. కంపెనీలో నిజాయతీగా పని చేసే ఉద్యోగులకు ఈ కీలక సమాచారం చేరకుండా అడ్డుకు న్నారని చెప్పారు. బోర్డు సభ్యులకు ఈ విషయాలేవీ అర్థం కావు. షేరు ధర రాణించినంత కాలం వారు వీటిని పట్టించుకోరని పరేఖ్ గతంలో వ్యాఖ్యానించినట్లు లేఖలో ఉల్లఖించారు. ప్రజావేగు ఫిర్యాదుల్ని ఆడిట్ కమిటీ ఎదుట ఉంచుతామని సంస్థ ప్రకటించింది. కంపెనీ ప్రజావేగు నిబంధనల ప్రకారం పరిష్కరి మని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos