ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, అదానీ గ్రూప్ షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. బుధవారం తొమ్మిది న్నర గంటల ప్రాంతంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 29 పాయింట్ల లాభంతో 52,802 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 8 పాయింట్ల వృద్ధితో 15,877 వద్ద ఉన్నాయి. ఓఎన్జీసీ, యూపీఎల్, ఐఓసీ, ఎంఅండ్ఎంలు లాభాల్లో, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో నష్టాల్లో ట్రేడవుతున్నాయి