రూ.500 కే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌

రూ.500 కే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలకు ఆకర్షణీయమైన హామీలతో రంగంలోకి కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. తాము గుజరాత్ ప్రజల కోసమే పనిచేస్తామని భరోసా రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.బీజేపీలాగా ఇద్దరు ముగ్గురు కోసం పనిచేయబోమని కుండ బద్దలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీతో అమీతుమీకి సిద్ధమైంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎదురవుతున్న పోటీని కూడా దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన హామీలను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ హామీలను సోమవారం అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. గుజరాత్ లోని సోదర సోదరీమణులందరికీ ఈ మేరకు మాటిస్తున్నాం అంటూ పరివర్తన్ సంకల్ప్ సమ్మేళన్ పేరిట కీలక అంశాలను ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు-1. రూ.500 కే గ్యాస్ సిలిండర్,2. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 3. రూ.10 లక్షల ఖర్చు వరకు ఉచిత వైద్యం, 4. రూ.3 లక్షల వరకు రైతులకు రుణ మాఫీ, 5. రాష్ట్రంలో 3 వేల ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలల స్థాపన, 6. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం , 7. లీటర్ కు రూ.5 చొప్పున పాల ఉత్పత్తిదారులకు సబ్సిడీ, 8. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి.9. నిరుద్యోగులకు రూ.3,000 భృతి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos