టీఆర్ఎస్ ఎంపీకి జైలు శిక్ష

టీఆర్ఎస్ ఎంపీకి జైలు శిక్ష

హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది. అయితే కోర్టు తీర్పుతో కవిత రూ.10వేల జరిమానా చెల్లించారు. అనంతరం ఆమెకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos