అమరావతి: పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి మరో సారి అంతరాయం కలిగింది. పోలవరం జల విద్యుత్ కేంద్ర పనులు ఆపేయా లని శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. గుత్తేదారు నవయుగ సంస్థ దాఖలు వ్యాజ్యంపై విచారణచేపట్టింది. ప్రతివాదులకు తాఖీదుల్ని జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.