అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికార్ల తెలిపారు. మంగళవారం చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం,గుంటూరు, కృష్ణా,ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవ వచ్చు. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వానలు పడొచ్చు. బుధ, గురువారాల్లోనూ కోస్తా, ఉత్తారాంధ్ర జిల్లాల్లో ఉరుము ల తో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే వీలుంది. పలు చోట్ల పిడుగులు కూడా పడవచ్చు.