హొసూరులో వర్షం కోసం పూజలు : కరుణించిన వరుణుడు

హొసూరులో వర్షం కోసం పూజలు : కరుణించిన వరుణుడు

హొసూరు : సకాలంలో వర్షాలు కురవాలని హొసూరులో పూజలు, హోమాలు నిర్వహించారు. యాదృచ్ఛికమో లేక దైవ కృపో…హోమాలు పూర్తయిన వెంటనే వర్షం పడడంతో భక్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. దీని కోసం బెంగళూరు నుంచి సుమారు 150 మంది ప్రాజ్ఞ భక్త జన బృందం, వారి గురువు శ్రీమతి శారద ఆధ్వర్యంలో మూగళూరులోని శ్రీ అంబా భవానీ ఆలయానికి వచ్చారు. రుద్ర పారాయణం, అభిషేక అలంకారం, భజన సత్సంగం, పల్లకి ఉత్సవాలను నిర్వహించారు. ఆత్మార్థ పూజలతో పాటు లోకార్థానికై ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఆలయ ధర్మాధికారి ప్రహ్లాద కరికట్టి అంబా భవానీకి విశేష అలంకారం, అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మూగళూరు గ్రామస్థులు ఎంఎస్. లక్ష్మణ రెడ్డి, ఎంఎస్. విజయ కుమార్, స్థానికులు ఏఎం. సుబ్రహ్మణ్యం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos