మహిషాసురుడుకి మ‌హాత్మా గాంధీ ముఖం

మహిషాసురుడుకి మ‌హాత్మా గాంధీ ముఖం

కోల్కతా: అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో మహాత్మా గాంధీని మహిషాసురుడుగా చూపించ డంపై వివాదం చెలరేగింది. ఒక మండపంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మహిషాసురుడికి గాంధీ ముఖాన్ని పెట్టారు. దీనిపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో పూజ నిర్వాహ కులు ముఖాన్ని మార్చారు. దీని గురించి అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామిని ఒక ఆంగ్ల మీడియా సంస్థ సంప్రదించి నపుడు ” మేము గాంధీని నిజమైన అసురుడిగా చూస్తాము. అయనే నిజమైన అసురుడు. అందుకే మేము దేవతా మూర్తిని ఇలా తయారు చేశాము. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని ప్రమోట్ చేస్తోంది. మేము బలవంతంగా మూర్తిని తొలగించి దానిని మార్చాము. మేము హోం మంత్రిత్వ శాఖ ఒత్తిడి చేశాము. గాంధీని అన్ని చోట్ల నుంచి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ముందు ఉంచాలనుకుంటున్నాము” గోస్వామి అన్నారు. ఈ చర్యను బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. దీనిపై బెంగాల్ హిందూ మహాసభ స్పందించింది. ఇలా చేసింది నిజమైన హిందూ మహా సభ కాదని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos