దేవీరపల్లిలో వైద్యశిబిరం

దేవీరపల్లిలో  వైద్యశిబిరం

హోసూరు : ఇక్కడికి సమీపంలోని బాలిగానిపల్లి పంచాయితీ దేవీరపల్లి గ్రామంలో కరోనా నిరోధక చర్యలలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడమే కాక కబాసుర కషాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నారాయణస్వామి, హోసూరు తాసీల్ధార్ సెంథిల్, గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos