హథ్రాస్‌ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం

లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు సీబీఐ దర్యాప్తును అలహాబాద్‌ కోర్టు పర్యవేక్షించనున్నట్లు సుప్రీం కోర్టు మంగళ వారం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత విచారణను ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధాని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు విన్నవించారు. 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్‌ 14న హథ్రాస్‌లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనేది ఆరోపణ. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 29న కన్నుమూసింది. బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు. పలువురు కార్యకర్తలు, న్యాయ వాదులు ఇదే విషయమై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. దరిమిలా అక్టోబర్‌ 15న వెల్లడించాల్సిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణకు సమ్మతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి రక్షణపై, బాధితుడి కుటుంబం న్యాయవాదిని ఎన్నుకున్నదా అనే దాని గురించి ఉన్నత న్యాయ స్థానం కోరిన వివరాల మేరకు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos