సంక్రాంతి సందర్భంగా విడుదలైన అలవైకుంఠపురములో,సరిలేరు నీకెవ్వరు చిత్రాల మధ్య వసూళ్ల యుద్ధంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది.తమవే నిజమైన వసూళ్లని వాళ్లవని ఫేక్ వసూళ్లంటూ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు.పోటాపోటీగా వందల కోట్ల వసూళ్ల పోస్టర్లు వదులుతూ తెలుగు చిత్ర పరిశ్రమ పరువు తీసేస్తున్నారు.ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే పలురువు స్పందించగా తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. నేనూ గెలవాలి ….All the Best నేను గెలవాలి …. Ok….. నేనే గెలవాలి …. Sorry Boss….” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సంక్రాంతి సినిమాల ఫేక్ కలెక్షన్లను ఉద్దేశించి వేసిన సెటైర్ అని ఎక్కువ మందికి అర్థం అయింది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పంచ్ మహేష్ బాబు సినిమాపై అనుకున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సెటైర్ అల్లు అర్జున్ సినిమా పై అనుకున్నారు. ఆ ట్వీట్ కింద కామెంట్ల లో ఒకరిని ఒకరు తిట్టుకోవడం మొదలు పెట్టారు. కొందరేమో ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల గురించి అంటూ మేథావుల తరహాలో తీర్మానించారు. ఒక నెటిజన్ “ఈ ట్వీట్లు సరే నీ కొత్త సినిమా సంగతి చెప్పు బాసు” అని చిరాకు పడ్డారు. మరో నెటిజన్ “నెక్స్ట్ సినిమా అఖిల్ తో అంటున్నారు.. నిజమేనా?” అని ప్రశ్నించాడు.